జై ఆంధ్రా అన్న కవిత అక్క
- July 03, 2016
కేసీఆర్ తనయురాలు, ఎంపీ కవిత జై ఆంధ్రా అని నినదించడమేంటని విస్తుపోతున్నారా, లేక ఇది నిజమా? అని అనుమానిస్తున్నారా. ఇది నిజంగా నిజమేనండి బాబోయ్. స్వయానా కవితగారే ఈ మాట అన్నారు. కాకపోతే అది తెలుగు నేలపై కాదనుకోండి. చికాగోలో నిర్వహిచిన తానా వేడుకల్లో టీఆర్ఎస్ ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారంతా కలిసుండాలని కోరుకుంటున్నామని చెప్పారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అతితక్కువ కాలంలో అనుమతులు ఇస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత, జై తెలంగాణ.. జై ఆంధ్రా నినాదాలతో తన ప్రసంగాన్ని ముగించారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం కూడా ఆంధ్రా నేతలు తెలంగాణకు అడ్డుపడుతున్నారు అంటూ ఇప్పటికీ ఆంధ్రా వాళ్ల వెంటపడుతున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కూతురు చేసిన వ్యాఖ్యాలపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి!
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







