జై ఆంధ్రా అన్న కవిత అక్క

- July 03, 2016 , by Maagulf
జై ఆంధ్రా అన్న కవిత అక్క

కేసీఆర్ తనయురాలు, ఎంపీ కవిత జై ఆంధ్రా అని నినదించడమేంటని విస్తుపోతున్నారా, లేక ఇది నిజమా? అని అనుమానిస్తున్నారా. ఇది నిజంగా నిజమేనండి బాబోయ్. స్వయానా కవితగారే ఈ మాట అన్నారు. కాకపోతే అది తెలుగు నేలపై కాదనుకోండి. చికాగోలో నిర్వహిచిన తానా వేడుకల్లో టీఆర్ఎస్ ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్ఐలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారంతా కలిసుండాలని కోరుకుంటున్నామని చెప్పారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అతితక్కువ కాలంలో అనుమతులు ఇస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత, జై తెలంగాణ.. జై ఆంధ్రా నినాదాలతో తన ప్రసంగాన్ని ముగించారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం కూడా ఆంధ్రా నేతలు తెలంగాణకు అడ్డుపడుతున్నారు అంటూ ఇప్పటికీ ఆంధ్రా వాళ్ల వెంటపడుతున్న టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కూతురు చేసిన వ్యాఖ్యాలపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com