ఏడాదికి రెండు సార్లు CBSE టెన్త్‌ పరీక్షలు..

- February 26, 2025 , by Maagulf
ఏడాదికి రెండు సార్లు CBSE టెన్త్‌ పరీక్షలు..

న్యూ ఢిల్లీ: కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (CBSE)లో పదో తరగతి విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి బోర్డు పరీక్షలను ఒక ఏడాదిలో రెండుసార్లు రాసే ఛాన్స్‌ రానుంది. తొలి దశ పరీక్షలు ఫిబ్రవరిలో నిర్వహించి, రెండో దశ పరీక్షలను మేలో నిర్వహిస్తారు.

ఈ మేరకు సీబీఎస్‌ఈ ముసాయిదాకు ఆమోద ముద్ర వేసింది. పబ్లిక్‌ నోటీస్‌ను కూడా సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. దీని పై ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటోంది. వచ్చేనెల 9 వరకు ప్రజలు ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వవచ్చు. అనంతరం దానికి సీబీఎస్‌ఈ ఆమోదం తెలుపుతుంది.

  • విద్యార్థులు తమ ఇష్టం మేరకు రెండు దశల్లోనూ పరీక్షలు రాయొచ్చు
  • తొలిసారి రాసిన ఎగ్జామ్స్‌లో ఎక్కువ మార్కులు సాధించిన సబ్జెక్టులను రెండో దశ పరీక్షల సమయంలో రాయొద్దని భావిస్తే వాటిని పక్కనపెటొచ్చు
  • తొలి దశ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి వరకు ఉంటాయి
  • రెండో దశ పరీక్షలు మే 5 నుంచి 20 వరకు జరుగుతాయి
  • రెండు దశల ఎగ్జామ్స్‌లో పాఠ్యాంశాలు అన్నింటినీ పరిగణనలో ఉంటాయి
  • స్టూడెంట్స్‌కు రెండు దశలకూ ఎగ్జామ్‌ సెంటర్ ఒకటే ఉంటుంది
  • 2026లో జరిగే ఎగ్జామ్స్‌ను రాసే స్టూడెంట్స్‌ లిస్టును 2025 సెప్టెంబరులో ఫైనల్‌ చేస్తారు
  • తొలి దశ ఎగ్జామ్స్‌లో ఏదైనా సబ్జెక్టు రాయలేదంటే దాని స్థానంలో మరో సబ్జెక్టును ఎంచుకునేందుకు ఛాన్స్‌ ఉంటుంది
  • మేలో ఎగ్జామ్స్‌ పూర్తయిన అనంతరం మార్కుల ఫైనల్‌ లిస్టును ఇస్తారు
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com