ఏడాదికి రెండు సార్లు CBSE టెన్త్ పరీక్షలు..
- February 26, 2025
న్యూ ఢిల్లీ: కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (CBSE)లో పదో తరగతి విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి బోర్డు పరీక్షలను ఒక ఏడాదిలో రెండుసార్లు రాసే ఛాన్స్ రానుంది. తొలి దశ పరీక్షలు ఫిబ్రవరిలో నిర్వహించి, రెండో దశ పరీక్షలను మేలో నిర్వహిస్తారు.
ఈ మేరకు సీబీఎస్ఈ ముసాయిదాకు ఆమోద ముద్ర వేసింది. పబ్లిక్ నోటీస్ను కూడా సీబీఎస్ఈ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. దీని పై ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది. వచ్చేనెల 9 వరకు ప్రజలు ఫీడ్బ్యాక్ ఇవ్వవచ్చు. అనంతరం దానికి సీబీఎస్ఈ ఆమోదం తెలుపుతుంది.
- విద్యార్థులు తమ ఇష్టం మేరకు రెండు దశల్లోనూ పరీక్షలు రాయొచ్చు
- తొలిసారి రాసిన ఎగ్జామ్స్లో ఎక్కువ మార్కులు సాధించిన సబ్జెక్టులను రెండో దశ పరీక్షల సమయంలో రాయొద్దని భావిస్తే వాటిని పక్కనపెటొచ్చు
- తొలి దశ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి వరకు ఉంటాయి
- రెండో దశ పరీక్షలు మే 5 నుంచి 20 వరకు జరుగుతాయి
- రెండు దశల ఎగ్జామ్స్లో పాఠ్యాంశాలు అన్నింటినీ పరిగణనలో ఉంటాయి
- స్టూడెంట్స్కు రెండు దశలకూ ఎగ్జామ్ సెంటర్ ఒకటే ఉంటుంది
- 2026లో జరిగే ఎగ్జామ్స్ను రాసే స్టూడెంట్స్ లిస్టును 2025 సెప్టెంబరులో ఫైనల్ చేస్తారు
- తొలి దశ ఎగ్జామ్స్లో ఏదైనా సబ్జెక్టు రాయలేదంటే దాని స్థానంలో మరో సబ్జెక్టును ఎంచుకునేందుకు ఛాన్స్ ఉంటుంది
- మేలో ఎగ్జామ్స్ పూర్తయిన అనంతరం మార్కుల ఫైనల్ లిస్టును ఇస్తారు
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







