సూడాన్ లో కుప్పకూలిన విమానం…10 మంది మృతి
- February 26, 2025
సూడాన్: దక్షిణ సూడాన్లో మిలటరీ విమానం ఒకటి కుప్పకూలిపోయింది.ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఖార్జూమ్ సమీపంలోని వాది సీద్నా ఎయిర్ బేస్ నుంచి మంగళవారం రాత్రి ఆర్మీ ఫ్లైట్ బయలుదేరేందుకు సిద్ధమైంది. ఈ విమానం రన్వేపై పరుగులు పెట్టి టేకాఫ్ అవుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది మృతి చెందారు. వారిలో ఆర్మీ అధికారులు, సాధారణ పౌరులు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో విమానంలో 20 మంది ఉన్నారు.. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. విమానాశ్రయంలోని అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసి, పలువురు ప్రయాణికులను కాపాడారు. ఖార్టూమ్ సమీపంలోని వాది సీద్నా ఆర్మీ ఎయిర్ బేస్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో నుంచి గాయాలతో బయటపడ్డ ప్రయాణికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రాథమిక దర్యాఫ్తులో విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!









