ధోఫర్ లో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు..!!
- March 03, 2025
సలాలా: ధోఫర్ గవర్నరేట్లో మూడు పర్వత మార్గాలను అభివృద్ధి చేయడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గవర్నరేట్లోని ప్రత్యేక స్థానిక కంపెనీలకు గవర్నరేట్లో అడ్వెంచర్ టూరిజం మౌలిక సదుపాయాలను అభివృద్ధి ప్రాజెక్టులను అప్పగించారు. జబల్ సంహాన్లో హై-వైర్ (వయా ఫెర్రాటా) కార్యకలాపాల కోసం ట్రాక్ ఏర్పాటును తాజాగా పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రాజెక్టులో చేర్చారు.వీటితోపాటు ఐన్ హషీర్ ప్రాంతం, తబల్ది చెట్లు, ఐన్ గైద్ మార్గంలో పర్వతారోహణ కోసం రోప్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకుల సౌలభ్యం కోసం నడక మార్గాలను పునరుద్ధరించనున్నారు. ధోఫర్ గవర్నరేట్ భౌగోళిక వైవిధ్యం సాహస పర్యాటకానికి ఎన్నో అవకాశాలను అందిస్తుంది. ఇక్కడి 40 కంటే ఎక్కువ ప్రసిద్ధ పర్వత మార్గాలు పర్యాటకులకు మరిచిపోలేని అనుభవాలను అందిస్తాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









