ధోఫర్ లో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు..!!
- March 03, 2025
సలాలా: ధోఫర్ గవర్నరేట్లో మూడు పర్వత మార్గాలను అభివృద్ధి చేయడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గవర్నరేట్లోని ప్రత్యేక స్థానిక కంపెనీలకు గవర్నరేట్లో అడ్వెంచర్ టూరిజం మౌలిక సదుపాయాలను అభివృద్ధి ప్రాజెక్టులను అప్పగించారు. జబల్ సంహాన్లో హై-వైర్ (వయా ఫెర్రాటా) కార్యకలాపాల కోసం ట్రాక్ ఏర్పాటును తాజాగా పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రాజెక్టులో చేర్చారు.వీటితోపాటు ఐన్ హషీర్ ప్రాంతం, తబల్ది చెట్లు, ఐన్ గైద్ మార్గంలో పర్వతారోహణ కోసం రోప్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకుల సౌలభ్యం కోసం నడక మార్గాలను పునరుద్ధరించనున్నారు. ధోఫర్ గవర్నరేట్ భౌగోళిక వైవిధ్యం సాహస పర్యాటకానికి ఎన్నో అవకాశాలను అందిస్తుంది. ఇక్కడి 40 కంటే ఎక్కువ ప్రసిద్ధ పర్వత మార్గాలు పర్యాటకులకు మరిచిపోలేని అనుభవాలను అందిస్తాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







