ధోఫర్ లో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు..!!
- March 03, 2025
సలాలా: ధోఫర్ గవర్నరేట్లో మూడు పర్వత మార్గాలను అభివృద్ధి చేయడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గవర్నరేట్లోని ప్రత్యేక స్థానిక కంపెనీలకు గవర్నరేట్లో అడ్వెంచర్ టూరిజం మౌలిక సదుపాయాలను అభివృద్ధి ప్రాజెక్టులను అప్పగించారు. జబల్ సంహాన్లో హై-వైర్ (వయా ఫెర్రాటా) కార్యకలాపాల కోసం ట్రాక్ ఏర్పాటును తాజాగా పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రాజెక్టులో చేర్చారు.వీటితోపాటు ఐన్ హషీర్ ప్రాంతం, తబల్ది చెట్లు, ఐన్ గైద్ మార్గంలో పర్వతారోహణ కోసం రోప్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకుల సౌలభ్యం కోసం నడక మార్గాలను పునరుద్ధరించనున్నారు. ధోఫర్ గవర్నరేట్ భౌగోళిక వైవిధ్యం సాహస పర్యాటకానికి ఎన్నో అవకాశాలను అందిస్తుంది. ఇక్కడి 40 కంటే ఎక్కువ ప్రసిద్ధ పర్వత మార్గాలు పర్యాటకులకు మరిచిపోలేని అనుభవాలను అందిస్తాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







