టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
- March 05, 2025
పాకిస్తాన్: న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ సెకండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లాహోర్లోని గడాఫీ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మార్చి 9న దుబాయ్లో భారత్తో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్లు మూడోసారి తలపడనున్నాయి. మునుపటి పోరులో ఇద్దరూ 1-1 తేడాతో గెలిచారు. ఫిబ్రవరిలో జరిగిన ముక్కోణపు సిరీస్లో ఈ రెండు జట్లు చివరిసారిగా వన్డేల్లో తలపడ్డాయి. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది.
ఇరు జట్లు:
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుసెన్, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), డేవిడ్ మిల్లర్, ఐడెన్ మర్క్రామ్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగీ న్గిడి.
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామిసన్, విలియం ఓరూర్కే.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







