టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
- March 05, 2025
పాకిస్తాన్: న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ సెకండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లాహోర్లోని గడాఫీ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మార్చి 9న దుబాయ్లో భారత్తో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్లు మూడోసారి తలపడనున్నాయి. మునుపటి పోరులో ఇద్దరూ 1-1 తేడాతో గెలిచారు. ఫిబ్రవరిలో జరిగిన ముక్కోణపు సిరీస్లో ఈ రెండు జట్లు చివరిసారిగా వన్డేల్లో తలపడ్డాయి. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది.
ఇరు జట్లు:
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుసెన్, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), డేవిడ్ మిల్లర్, ఐడెన్ మర్క్రామ్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగీ న్గిడి.
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామిసన్, విలియం ఓరూర్కే.
తాజా వార్తలు
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







