హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- March 12, 2026
రియాద్: హరమైన్ హై-స్పీడ్ రైల్వేను రమదాన్ ప్రారంభం నుండి ఇప్పటివరకు వరకు 700,000 మందికి పైగా సందర్శకులు మరియు యాత్రికులు ఉపయోగించుకున్నారని ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) ప్రకటించింది.
హరామైన్ హై-స్పీడ్ రైల్వే మొత్తం 2,300 ట్రిప్పులు తిరిగిందని TGA వివరించింది. ఈ రైలు నగరాల మధ్య రోడ్డు నెట్వర్క్లపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా లబ్ధిదారులకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుందని అథారిటీ వెల్లడించింది.
ఇక, హరమైన్ హై-స్పీడ్ రైల్వే ఏడాది పొడవునా యాత్రికులకు సేవలందించే కీలకమైన రవాణా ప్రాజెక్టులలో ఒకటి. ఇది మక్కా మరియు మదీనాలను జెడ్డా, కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీ ద్వారా కలుపుతుంది. ప్రపంచంలోని పది వేగవంతమైన రైళ్లలో ఇది ఒకటిగా నిలిచింది. దీని షెడ్యూల్ వేగం గంటకు 300 కి.మీ. అని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









