హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- March 12, 2026
రియాద్: హరమైన్ హై-స్పీడ్ రైల్వేను రమదాన్ ప్రారంభం నుండి ఇప్పటివరకు వరకు 700,000 మందికి పైగా సందర్శకులు మరియు యాత్రికులు ఉపయోగించుకున్నారని ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) ప్రకటించింది.
హరామైన్ హై-స్పీడ్ రైల్వే మొత్తం 2,300 ట్రిప్పులు తిరిగిందని TGA వివరించింది. ఈ రైలు నగరాల మధ్య రోడ్డు నెట్వర్క్లపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా లబ్ధిదారులకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుందని అథారిటీ వెల్లడించింది.
ఇక, హరమైన్ హై-స్పీడ్ రైల్వే ఏడాది పొడవునా యాత్రికులకు సేవలందించే కీలకమైన రవాణా ప్రాజెక్టులలో ఒకటి. ఇది మక్కా మరియు మదీనాలను జెడ్డా, కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీ ద్వారా కలుపుతుంది. ప్రపంచంలోని పది వేగవంతమైన రైళ్లలో ఇది ఒకటిగా నిలిచింది. దీని షెడ్యూల్ వేగం గంటకు 300 కి.మీ. అని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్లో ట్రాఫిక్ మార్పులు: ఐదవ రింగ్ రోడ్డుపై 14 రోజుల పాటు లేన్లు మూసివేత
- NTPCలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
- దుబాయ్లో ప్రాపర్టీ ఇన్వెస్టర్లకు రెండు సంవత్సరాల రెసిడెన్సీ వీసా నిబంధనల్లో మార్పులు
- మేలో బ్యాంక్ హాలిడేస్ ఫుల్ లిస్ట్..!
- దక్షిణ సూడాన్ రాజధాని శివార్లలో విమానం కూలి 14 మంది మృతి
- ఎగ్జిట్ పోల్స్ కౌంట్డౌన్ షురూ.. మే 4న తుది ఫలితాలు
- పర్యాటకానికి కొత్త కళ..హైదరాబాద్లో భారీ కార్నివాల్ నిర్వహణ
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!









