హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- March 12, 2026
రియాద్: హరమైన్ హై-స్పీడ్ రైల్వేను రమదాన్ ప్రారంభం నుండి ఇప్పటివరకు వరకు 700,000 మందికి పైగా సందర్శకులు మరియు యాత్రికులు ఉపయోగించుకున్నారని ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) ప్రకటించింది.
హరామైన్ హై-స్పీడ్ రైల్వే మొత్తం 2,300 ట్రిప్పులు తిరిగిందని TGA వివరించింది. ఈ రైలు నగరాల మధ్య రోడ్డు నెట్వర్క్లపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా లబ్ధిదారులకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుందని అథారిటీ వెల్లడించింది.
ఇక, హరమైన్ హై-స్పీడ్ రైల్వే ఏడాది పొడవునా యాత్రికులకు సేవలందించే కీలకమైన రవాణా ప్రాజెక్టులలో ఒకటి. ఇది మక్కా మరియు మదీనాలను జెడ్డా, కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీ ద్వారా కలుపుతుంది. ప్రపంచంలోని పది వేగవంతమైన రైళ్లలో ఇది ఒకటిగా నిలిచింది. దీని షెడ్యూల్ వేగం గంటకు 300 కి.మీ. అని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!







