హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!

- March 12, 2026 , by Maagulf
హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!

రియాద్: హరమైన్ హై-స్పీడ్ రైల్వేను రమదాన్ ప్రారంభం నుండి ఇప్పటివరకు వరకు 700,000 మందికి పైగా సందర్శకులు మరియు యాత్రికులు ఉపయోగించుకున్నారని ట్రాన్స్‌పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) ప్రకటించింది.

హరామైన్ హై-స్పీడ్ రైల్వే మొత్తం 2,300 ట్రిప్పులు తిరిగిందని TGA వివరించింది. ఈ రైలు నగరాల మధ్య రోడ్డు నెట్‌వర్క్‌లపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా లబ్ధిదారులకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుందని అథారిటీ వెల్లడించింది.

ఇక, హరమైన్ హై-స్పీడ్ రైల్వే ఏడాది పొడవునా యాత్రికులకు సేవలందించే కీలకమైన రవాణా ప్రాజెక్టులలో ఒకటి. ఇది మక్కా మరియు మదీనాలను జెడ్డా, కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీ ద్వారా కలుపుతుంది. ప్రపంచంలోని పది వేగవంతమైన రైళ్లలో ఇది ఒకటిగా నిలిచింది. దీని షెడ్యూల్ వేగం గంటకు 300 కి.మీ. అని అథారిటీ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com