సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!
- March 12, 2026
దోహా: ఒమన్ సుల్తానేట్లోని సలాలా పోర్టును లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడి చేసి చేయడాన్ని ఖతార్ తీవ్రంగా ఖండించింది.ఈ దాడిని ఖతార్ ఒక స్పష్టమైన దురాక్రమణ చర్యగా మరియు అంతర్జాతీయ చట్టం మరియు దాని సూత్రాలను ఉల్లంఘించినట్లుగా భావిస్తున్నట్టు స్పష్టం చేసింది.
ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్న ఒమన్ సుల్తానేట్ను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని హితవు పలికింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇలాంటి దాడులు ఈ ప్రాంత భద్రత మరియు స్థిరత్వాన్ని దెబ్బతిస్తాయని, అలాగే ప్రాంతీయ మరియు అంతర్జాతీయ ప్రయత్నాలను బలహీనపరిచే ప్రమాదం ఉందన్నారు.
ఒమన్ సుల్తానేట్కు ఖతార్ పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తుందని తెలిపింది. దాని సార్వభౌమాధికారం, భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఒమన్ తీసుకునే అన్ని చర్యలకు మద్దతు ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!







