సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!
- March 12, 2026
దోహా: ఒమన్ సుల్తానేట్లోని సలాలా పోర్టును లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడి చేసి చేయడాన్ని ఖతార్ తీవ్రంగా ఖండించింది.ఈ దాడిని ఖతార్ ఒక స్పష్టమైన దురాక్రమణ చర్యగా మరియు అంతర్జాతీయ చట్టం మరియు దాని సూత్రాలను ఉల్లంఘించినట్లుగా భావిస్తున్నట్టు స్పష్టం చేసింది.
ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్న ఒమన్ సుల్తానేట్ను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని హితవు పలికింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇలాంటి దాడులు ఈ ప్రాంత భద్రత మరియు స్థిరత్వాన్ని దెబ్బతిస్తాయని, అలాగే ప్రాంతీయ మరియు అంతర్జాతీయ ప్రయత్నాలను బలహీనపరిచే ప్రమాదం ఉందన్నారు.
ఒమన్ సుల్తానేట్కు ఖతార్ పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తుందని తెలిపింది. దాని సార్వభౌమాధికారం, భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఒమన్ తీసుకునే అన్ని చర్యలకు మద్దతు ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









