పెరిగిన వెండి ధర

- July 04, 2016 , by Maagulf
పెరిగిన వెండి ధర

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డిమాండ్‌ ఎక్కువవడంతో వెండి ధర విపరీతంగా పెరుగుతోంది. వరుసగా ఆరో రోజు ధర పెరగడంతో 28 నెలల గరిష్ఠానికి చేరుకుంది. సోమవారం రూ. 2,155 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 47,715గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో ధర పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

స్వల్పంగా పెరిగిన బంగారం మరోవైపు బంగారం ధర కూడా నేడు స్వల్పంగా పెరిగింది. రూ. 100 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ. 30,650కు చేరుకుంది. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,357.63 యూఎస్‌ డాలర్లుగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com