నేడు 'బర్ దుబాయి'లో రక్తదానశిబిరం
- July 11, 2015
దుబాయిలోని సర్వ మత నాన్ ప్రాఫిట్ సంస్థ ఐన "ద సైన్స్ ఆఫ్ స్పిరిట్యూవాలిటీ" వారు తమ 21వ రక్తదాన శిబిరాన్ని బర్ దుబాయి, మీనా బజార్ లోని సింధీ మెమోరియల్ సెంటర్లో నేడు ఏర్పాటుచేయనున్నారు. మానవసేవయే ముఖ్యోద్దేశంగా, లతిఫా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాల క్రితం మొదలైన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 3000మంది విజయవంతంగా రక్తం దానం చేశారనీ, తద్వారా ఇంచుమించు 10,000మంది జీవితాలను ఆదుకున్నారని తెలియవచ్చింది. రక్తదానం తీసుకునేవారినే కాక, ఇచ్చిన వారికి కూడా మేలు చేస్తుందనీ, రక్తదానం వల్ల రక్తప్రసరణ మెరుగౌతుందని, తద్వారా శరీరంలో ఐరన్ స్తాయి స్థిరంగా ఉంది, రక్తదానం చేసిన ప్రతీసారి ఎర్ర రక్తకణాల ఉత్పత్తి మెరుగౌతుందని శాస్త్రీయంగా నిరూపితమైనట్టు సంస్థ అధికారులు తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









