నేడు 'బర్ దుబాయి'లో రక్తదానశిబిరం

- July 11, 2015 , by Maagulf
నేడు 'బర్ దుబాయి'లో రక్తదానశిబిరం


దుబాయిలోని సర్వ మత నాన్ ప్రాఫిట్ సంస్థ ఐన "ద సైన్స్ ఆఫ్  స్పిరిట్యూవాలిటీ" వారు తమ 21వ రక్తదాన శిబిరాన్ని బర్ దుబాయి, మీనా బజార్ లోని సింధీ మెమోరియల్ సెంటర్లో నేడు ఏర్పాటుచేయనున్నారు. మానవసేవయే ముఖ్యోద్దేశంగా, లతిఫా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాల క్రితం మొదలైన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 3000మంది విజయవంతంగా రక్తం దానం చేశారనీ, తద్వారా ఇంచుమించు 10,000మంది జీవితాలను ఆదుకున్నారని తెలియవచ్చింది. రక్తదానం తీసుకునేవారినే కాక, ఇచ్చిన వారికి కూడా మేలు చేస్తుందనీ, రక్తదానం వల్ల రక్తప్రసరణ మెరుగౌతుందని, తద్వారా శరీరంలో ఐరన్ స్తాయి స్థిరంగా ఉంది, రక్తదానం చేసిన ప్రతీసారి ఎర్ర రక్తకణాల ఉత్పత్తి మెరుగౌతుందని శాస్త్రీయంగా నిరూపితమైనట్టు సంస్థ అధికారులు తెలియజేశారు.


--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com