బహ్రెయిన్లో ట్రాఫిక్ సవాళ్లపై లోతైన అధ్యయనం..!!
- March 13, 2025
మనామా: రహదారి భద్రతను పెంచడానికి నిరంతర ప్రయత్నాలు అవసరమని బహ్రెయిన్ ట్రాఫిక్ కౌన్సిల్ చైర్మన్, అంతర్గత వ్యవహారాల మంత్రి జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా అన్నారు. ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి వాహన సంఖ్యలు, భద్రతా ప్రమాణాలు, సంబంధిత విధానాలపై సమగ్ర అధ్యయనం అవసరమని ఆయన హైలైట్ చేశారు. ఆయన అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కౌన్సిల్ దాని ఎజెండాలోని కీలక అంశాలను సమీక్షించారు. ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉద్దేశించిన చర్యలపై ఫోకస్ చేశారు. వాహనాల సంఖ్యలు, లైసెన్స్లు, ట్రాఫిక్ చట్టాలను నియంత్రించడంతోపాటు ట్రాఫిక్ నిర్వహణ, రోడ్ నెట్వర్క్ మెరుగుదలల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై చర్చించారు.
బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ & కన్వెన్షన్ సెంటర్కు వెళ్లే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు.. రోడ్ నెట్వర్క్లను విస్తరించడానికి వివరణాత్మక వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి రూపొందించిన ప్రణాళికలపై సమీక్షించారు. అదే సమయంలో బస్సులు, స్టేషన్ల సంఖ్యను పెంచడంతో సహా ప్రజా రవాణా రంగాన్ని మెరుగుపరచడానికి జరుగుతున్న ప్రయత్నాలపై చర్చించారు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







