'ఇండీవుడ్ మీడియా ఎక్స్లెన్స్ అవార్డ్-2016' గెలుచుకున్న 'మా గల్ఫ్'
- September 24, 2016అతి తక్కువ కాలంలోనే గల్ఫ్లోని తెలుగువారి మనసుల్ని చూరగొన్న మీడియా పోర్టల్ 'మాగల్ఫ్.కామ్' అరుదైన గౌరవం దక్కించుకుంది. ఇండీవుడ్ కార్నివాల్లో భాగంగా 2016 సంవత్సరానికిగాను మీడియా ఎక్స్లెన్స్ అవార్డ్ విభాగంలో 'మాగల్ఫ్.కామ్' గెలుచుకుంది.అది అరుదైన గౌరవంగా చెప్పుకోవాలి. ఈ అవార్డుని 'మాగల్ఫ్.కామ్' అధినేత శ్రీకాంత్ చిత్తర్వు అందుకున్నారు. ఆయనతో లో పాటు ఆర్.వి.ఆర్ ప్రసాద్,శరత్ చంద్ర,సుందీప్, నవనీత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా 'మాగల్ఫ్.కామ్' ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతోంది.ఇండీవుడ్ నిర్వాహకులు, జ్యూరీ మెంబర్స్, అలాగే మా గల్ఫ్ వీక్షకులు,జర్నలిస్ట్స్,రిపోర్టర్స్ మరియు రచయితలకు మాగల్ఫ్.కామ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ కార్నివాల్లో 132కి పైగా సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి. రామోజీ ఫిలిం సిటీ ఈ సంబరాలకు వేదికయ్యింది. 80 దేశాలకు చెందిన ప్రతినిథులు ఈ కార్నివాల్కి హాజరయ్యారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు,ఆర్ధిక శాఖ & పబ్లిక్ రిలేషన్స్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఇండీవుడ్ వేదిక రూపకర్త సోహన్ రాయ్ తదితరులు ఈ వేడుకల్ని ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు