పాట చిత్రీకరణ సందడిలో '2.ఓ'
- December 22, 2016శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న చిత్రం '2.ఓ'. ఇది 'ఎందిరన్'కు సీక్వెల్ అనే విషయం తెలిసిందే. ఎమీజాక్సన్ కథానాయిక. అక్షయ్కుమార్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన యుగళగీతాన్ని ఉత్తరప్రదేశ్లో చిత్రీకరించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
దీనికోసం ఇటీవల శంకర్ తన శిష్యులతో కలిసి లొకేషన్లు చూసొచ్చారని తెలిసింది. జ్ఞానేశ్వర్ మిశ్రా పార్కు, గోమతి నది తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నారు. ఈ విషయాన్ని యూపీ చలన చిత్రాభివృద్ధి మండలి ఉపాధ్యక్షుడు గౌరవ్ ద్వివేది కూడా స్పష్టం చేశారు. దక్షిణాది చిత్ర పరిశ్రమను ఆకర్షించేరీతిలో ముఖ్యమంత్రి సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, శంకర్ వంటి దర్శకుడు తమ రాష్ట్రంలో చిత్రీకరణ జరపనుండటం ఆనందంగా ఉందని తెలిపారు. తమపరంగా అన్ని విధాలా సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ