ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్కి రంగం సిద్ధం
- March 07, 2017ఐదు రోజులపాటు జరిగే ఇండియన్ ఫుడ్ ఫెస్టివల్కి రంగం సిద్ధమయ్యింది. గ్రాండ్ హయాత్ మస్కట్లో మార్చ్ 15 నుంచి ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఒమన్లో ఇండియా అంబాసిడర్ ఇంద్రా మణి పాండే ఈ విషయాన్ని వెల్లడించారు. ఇండియన్ ఎంబసీ - భారత మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తోంది. వెస్ట్ బెంగాల్, జమ్మూ అండ్ కాశ్మీర్, గుజరాత్, రాజస్తాన్ మరియు గోవా తదితర రాష్ట్రాలనుంచి అంతగా ప్రాచుర్యం లేని ప్రత్యేక ఆహార పదార్థాల్ని ఇక్కడ ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నామని పాండే తెలిపారు. అలాగే మిగతా రాష్ట్రాల్లోని ప్రత్యేక వంటకాలకు లోటు ఏమీ ఉండదనీ, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఆహార పదార్థాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. మెనూ చాలా కొత్తగా ఉంటుందనీ, ఎవరూ ఊహించని విధంగా ఏర్పాటు చేసే మెనూ అందరికీ నచ్చుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కోఆపరేషన్ ద్వారా ఇద్దరు చెఫ్లను ఎంపిక చేశారు. వారిద్దరూ ఈ ఫెస్టివల్లో పాల్గొంటారు. గ్రాండ్ హయాత్ చెఫ్స్తో కలిసి వారు పనిచేస్తారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం