ప్రభుత్వం ప్రవాసులను ఆదుకోవాలని డిమాండ్
- March 30, 2017గల్ఫ్ కార్మికుడి శవయాత్రలో ప్లకార్డులతో ప్రదర్శన. గల్ఫ్ దేశాలలోని వలస కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం (30.03.2017) న ఒక గల్ఫ్ కార్మికుడి శవయాత్రలో ప్లకార్డులతో పాల్గొన్న సంఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచంపల్లి లో జరిగింది. నిర్మల్ జిల్లా ప్రవాసి కార్మిక నాయకుడు పోతుగంటి సాయేందర్ ఆధ్వర్యంలో గ్రామస్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. కూచంపల్లి కి చెందిన యెలిగాటి రాజేశ్వర్ తేది: 25.02.2017 మస్కట్, ఓమాన్ లో చనిపోయారు. దుబాయిలో ఉంటున్న ఇతని కుమారుడు వచ్చి అంత్యక్రియలలో పాల్గొన్నాడు.
ఓమాన్ లోని సామజిక కార్యకర్తలు లింగన్న, హరిబాబు శవాన్ని ఇండియాకు పంపుటకు కృషిచేశారు. తెలంగాణ ఎమిగ్రంట్స్ లేబర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోండ్ల గంగాప్రసాద్ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి కూచంపల్లి శవపేటిక రవాణాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నారై విభాగం వారు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.
ఈ క్రింది డిమాండ్లతో గ్రామస్థులు శవయాత్రలో పాల్గొన్నారు
'తెలంగాణ ప్రవాసుల సంక్షేమం' పేరిట టిఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక-2014 లో వలసదారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి.
అధికారంలోకి వచ్చి 33 నెలలు అయింది ! ఇకనైనా పట్టించుకోండి మా ప్రవాసులను !
తెలంగాణ ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) రూపకల్పన అయ్యింది.. అమలు నిలిచింది.
గల్ఫ్ ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ లో రూ. 100 కోట్లు కేటాయించాలి.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నారై సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చెయాలి.
సచివాలయంలో ఉన్న ఎన్నారై సెల్ ను సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా బయట ఏర్పాటు చేయాలి.
విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా (మృత ధన సహాయం) ఇవ్వాలి.
గల్ఫ్ నుండి సంవత్సరానికి 200 మంది తెలంగాణ ప్రవాసీ బిడ్డలు చనిపోతున్నారు
శవపేటికల్లో తెలంగాణకు చేరుతున్నారు. 2 జూన్ 2014 నుండి ఈనాటి వరకు 500 మంది
తెలంగాణ ప్రవాసీ బిడ్డల మృతదేహాలు శవపేటికలలో హైదరాబాద్ ఏర్ పోర్ట్ ద్వారా ఇంటికి కు చేరుకున్నాయి. రాష్ట్రం నుండి విదేశాలకు జరిగే వలసలపై ప్రభుత్వం సమగ్రమైన సర్వే నిర్వహించాలి.
ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రవాసి సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
వలసవెళ్ళే కార్మికులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చైతన్య సదస్సులు నిర్వహించాలి.
కేరళ తరహాలో ప్రవాసీల రక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలి.
విదేశాల నుండి అనుకోకుండా తిరిగి వచ్చిన వలస కార్మికులకు పునరావాసం కల్పించాలి.
వలస పోయిన వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించవద్దు.
మానవ అక్రమ రవాణాను అరికట్టాలి రిక్రూటింగ్ వ్యవస్తపై నిఘా ఏర్పాటు చేయాలి.
విదేశీ జైళ్లలో మగ్గుతున్న వారికి న్యాయ సహాయం చేసి విడుదల చేయాలి.
ఎం.భీమ్ రెడ్డి
తాజా వార్తలు
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో