ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- April 26, 2024
దోహా: అబు సమ్రా సరిహద్దు క్రాసింగ్ ద్వారా దేశంలోకి ప్రవేశిస్తున్న వాహనంలో ఆయుధాలు, తుపాకీలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని ల్యాండ్ కస్టమ్స్ విభాగం అడ్డుకుంది. ఓడరేవుకు చేరుకోగానే వాహనాన్ని వెహికల్ స్కానింగ్ పరికరంతో అధికారులు తనిఖీలు చేశారు. వాహనంలో రహస్యంగా దాచిన మూడు ఆయుధాలు, 1,900 బుల్లెట్లను గుర్తించారు. దేశంలోకి వాహనాలు సురక్షితంగా ప్రవేశించేందుకు వీలుగా జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ ఇటీవల అబూ సమ్రా సరిహద్దు వద్ద కొత్త తనిఖీ పరికరాలను ప్రవేశపెట్టింది. ఈ పరికరాలు గంటకు 130 కార్లను స్క్రీనింగ్ చేయగలవు. ఒక్కో వాహనానికి సుమారుగా రెండు నిమిషాల చొప్పున ఖతార్లోకి ప్రవేశించకుండా నిషేధించబడిన ప్రమాదకర పదార్థాలను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవల్లో మార్పులు..







