ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- April 26, 2024
దోహా: అబు సమ్రా సరిహద్దు క్రాసింగ్ ద్వారా దేశంలోకి ప్రవేశిస్తున్న వాహనంలో ఆయుధాలు, తుపాకీలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని ల్యాండ్ కస్టమ్స్ విభాగం అడ్డుకుంది. ఓడరేవుకు చేరుకోగానే వాహనాన్ని వెహికల్ స్కానింగ్ పరికరంతో అధికారులు తనిఖీలు చేశారు. వాహనంలో రహస్యంగా దాచిన మూడు ఆయుధాలు, 1,900 బుల్లెట్లను గుర్తించారు. దేశంలోకి వాహనాలు సురక్షితంగా ప్రవేశించేందుకు వీలుగా జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ ఇటీవల అబూ సమ్రా సరిహద్దు వద్ద కొత్త తనిఖీ పరికరాలను ప్రవేశపెట్టింది. ఈ పరికరాలు గంటకు 130 కార్లను స్క్రీనింగ్ చేయగలవు. ఒక్కో వాహనానికి సుమారుగా రెండు నిమిషాల చొప్పున ఖతార్లోకి ప్రవేశించకుండా నిషేధించబడిన ప్రమాదకర పదార్థాలను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తాయి.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









