ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- April 26, 2024దోహా: అబు సమ్రా సరిహద్దు క్రాసింగ్ ద్వారా దేశంలోకి ప్రవేశిస్తున్న వాహనంలో ఆయుధాలు, తుపాకీలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని ల్యాండ్ కస్టమ్స్ విభాగం అడ్డుకుంది. ఓడరేవుకు చేరుకోగానే వాహనాన్ని వెహికల్ స్కానింగ్ పరికరంతో అధికారులు తనిఖీలు చేశారు. వాహనంలో రహస్యంగా దాచిన మూడు ఆయుధాలు, 1,900 బుల్లెట్లను గుర్తించారు. దేశంలోకి వాహనాలు సురక్షితంగా ప్రవేశించేందుకు వీలుగా జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ ఇటీవల అబూ సమ్రా సరిహద్దు వద్ద కొత్త తనిఖీ పరికరాలను ప్రవేశపెట్టింది. ఈ పరికరాలు గంటకు 130 కార్లను స్క్రీనింగ్ చేయగలవు. ఒక్కో వాహనానికి సుమారుగా రెండు నిమిషాల చొప్పున ఖతార్లోకి ప్రవేశించకుండా నిషేధించబడిన ప్రమాదకర పదార్థాలను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తాయి.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు