ఆడవాళ్లకు సువర్ణ అవకాశం పెళ్లైనా పాత ఇంటి పేరే
- April 13, 2017పాస్పోర్ట్లో మార్చుకోవాల్సిన అవసరం లేదు: మోదీ
పెళ్లైన అనంతరం మహిళలు పాస్పోర్టుల్లో తమ ఇంటి పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని, ప్రయాణ పత్రాలు పొందేందుకు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి పేరును వాడుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. నిబంధనలు మారాయని... ఇక నుంచి పాస్పోర్టు పొందేందుకు మహిళలు వివాహ ధ్రువీకరణ లేక విడాకుల పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ‘ఇండియన్ మర్చంట్స్ చాంబర్స్(ఐఎంసీ)’ మహిళా విభాగాన్ని ఉద్దేశించి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ... మహిళలే లక్ష్యంగా అభివృద్ధి పథకాలు కొనసాగాలన్నదే తన అభిమతమన్నారు.
ఈ సందర్భంగా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రశంసించిన మోదీ ‘అవకాశమిస్తే పురుషుల కంటే రెండడుగులు ముందే ఉంటామని మహిళలకు రుజువు చేశారు. డెయిరీ, పశు పరిశ్రమ రంగాల్లో మహిళల వాటానే అత్యధికం. మహిళా సాధికారతకు లిజ్జత్ పాపడ్, అమూల్లే చక్కని ఉదాహరణలు’ అని పేర్కొన్నారు. ముద్రా రుణాల్లో 70 శాతం మహిళలే తీసుకుంటున్నారని, మహిళల్లో ఔత్సాహిక పారిశ్రామిక స్ఫూర్తికి అది అద్దంపడుతుందని చెప్పారు. కాగా, బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా నేడు మోదీ నాగ్పూర్లో ఆయనకు నివాళులర్పించడంతో దీక్షా భూమి వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభిస్తారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి