రస్ అల్ ఖైమా: 363 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- May 25, 2017సుప్రీం కౌన్సిల్ మెంబర్, రస్ అల్ ఖైమా రూలర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి, 363 మంది ఖైదీలను విడుదల చేస్తూ క్షమాభిక్షను ప్రసాదించారు. పవిత్ర రమదాన్ మాసం, అలాగూ యూఏఈ 'ఇయర్ ఆఫ్ గివింగ్' కార్యక్రమంలో భాగంగా ఈ క్షమాభ్షిను ప్రసాదించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఖైదీలకు సంబంధించిన ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగించేందుకు కూడా షేక్ సౌద్ సుముఖత వ్యక్తం చేశారు. రస్ అల్ ఖైమా జ్యుడీషియల్ కౌన్సిల్ ఛైర్మన్కి ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ, క్షమాభిక్షకు సంబంధించి అవసరమైన వ్యవహారాల్ని చూసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి. క్షమాభిక్ష పొందినవారు సమాజంలో మంచి పౌరులుగా జీవించాలనీ, వారి కుటుంబాలకు మంచి జీవితాన్ని అందించడంతోపాటు, దేశ ప్రగతిలోనూ భాగం కావాలని ఈ సందర్భంగా సూచించారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం