పెట్రోకెమికల్ గిడ్డంగిలో అగ్ని ప్రమాదం దెబ్బతిన్న 27 వాహనాలు
- May 25, 2017అల్ రాయ్:స్థానిక పెట్రోకెమికల్ కర్మాగారంలో బుధవారం సంభవించిన ఒక అగ్నిప్రమాదం సమర్ధవంతంగా అదుపు చేసినట్లు కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ తెలిపింది. బుధవారం ఉదయం రాయ్ ప్రాంతంలో 2,000 చదరపు మీటర్ల పరిధిలో పెట్రోకెమికల్స్ గిడ్డంగిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక నియంత్రణ సమయంలో 27 వాహనాలు దెబ్బతిన్న నేపథ్యంలో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారని ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 2,000 చదరపు మీటర్ల పెట్రోకెమికల్ ప్లాంట్లో అగ్నిని అదుపులోనికి తెచ్చేందుకు ఆరు అగ్నిమాపక బృందాలు తక్షణమే ప్రమాద స్థలానికి తరలివెళ్ళాయి. ఎలాగైతే, పెట్రోకెమికల్ కర్మాగారంలో ఎగిసిపడిన భారీ జ్వాలలను అదుపు చేసినప్పటికీ పెద్ద స్థాయిలో ఆస్తులు నష్టం వాటిల్లిందని కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఒప్పుకుంది. ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాద సంఘటనకు ఖచ్చితమైన కారణాలను కనుగొనడానికి సంబంధిత అధికారులచే పరిశోధన జరగాల్సి ఉంది.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం