మేథీ, కార్న్ పులావ్
- October 04, 2017కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ - 2 కప్పులు, స్వీట్కార్న్- ఒక కప్పు, మెంతికూర- మూడు కట్టలు, టమాటాలు- రెండు, ఉల్లి పాయ- 1, పచ్చిమిర్చి- 2, కొత్తిమీర- ఒక కట్ట, ఉప్పు - తగినంత, పసుపు- చిటికెడు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరంమసాలా పొడి, లవం గాలు, చెక్క, షాజీర
తయారీ విధానం: బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. కుక్కర్లో నూనె వేడిచేసి చెక్క, లవంగాలు, షాజీర వేసి వేగనివ్వాలి. ఇప్పుడు నిలువుగా తరిగిన ఉల్లి, మిర్చి వేసి వేయించి టమాటా ముక్కలు వేయాలి. టమాటాలు మెత్తగా ఉడి కిన తరువాత పసుపు, కారం, ఒక టేబుల్ స్పూన అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి, తరి గిన మెంతికూర, స్వీట్కార్న్, ఒక టేబుల్ స్పూన గరం మసాలా పొడి వేసి కలపాలి. రెండు మూడు నిమిషాలు వేయించి తగినన్ని నీళ్ళు, ఉప్పు వేయాలి. నీరు మరిగినప్పుడు బియ్యం వేసి కలిపి మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఆవిరి అంతా పోయిన తరువాత తీసి ఒకసారి కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!