ఇండికేటర్స్ వినియోగించకపోవడం కూడా ఉల్లంఘనే
- October 12, 2017మస్కట్: వాహనదారుడు తన వాహనాన్ని నడుపుతున్న సమయంలో కుడి వైపుకు లేదా ఎడమవైపుకు తిరగాలనుకుంటే, సంబంధిత ఇండికేటర్స్ వినియోగించాలనీ, అలా వినియోగించకపోవడం కూడా ఉల్లంఘన కిందకే వస్తుందని రాయలఠ్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. ఈ తరహా ఉల్లంఘనకు పాల్పడితే 15 ఒమన్ రియాల్స్ జరీమానా తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై వెళుతూ అకస్మాత్తుగా లేన్లు మారిపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయనీ, ఇండికేటర్లను వినియోగించడం ద్వారా ప్రమాదాలను నియంత్రించవచ్చునని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. చిన్న చిన్న తప్పిదాలే పెను ప్రమాదాలకు దారి తీస్తున్నందున, ఇతర వాహనాలను గౌరవించి వాహనదారులు తమ వాహనాల్ని నడిపేటప్పుడు ఇండికేటర్స్ తప్పనిసరిగా వాడాలనీ, బ్రేక్ లైట్ సహా వాహనంలో అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని వాహనాల్ని నడపాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం