ఉత్తర్ప్రదేశ్లో హిందీ వార్తా పత్రికకు చెందిన జర్నలిస్ట్ హత్య
- October 21, 2017ఉత్తర్ప్రదేశ్లో దారుణం చేటుచేసుకుంది. ప్రముఖ హిందీ వార్తా పత్రికకు చెందిన రాజేశ్ మిశ్రా(38) అనే విలేకరి ఘాజీపూర్ జిల్లాలో దారుణహత్యకు గురయ్యారు. మిశ్రా కుటుంబం భవన నిర్మాణ సామాగ్రి దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయన శనివారం ఉదయం దుకాణం వద్ద నిల్చుని ఉండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు దుండగులు అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చారు. దీంతో మిశ్రా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాజేశ్ మిశ్రా ఆర్ఎస్ఎస్లో సభ్యుడిగా ఉన్నారు.
కాల్పుల శబ్దం విన్న మిశ్రా సోదరుడు అమితాబ్ మిశ్రా దుకాణం నుంచి బయటకు రాగా దుండగులు అతడిపైనా కాల్పులు జరిపి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ని హుటాహుటిన ఘాజీపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతోవారణాసికి తరలించారు.
రాజేశ్ మిశ్రా హత్యకు పాత కక్షలే కారణమై ఉండొచ్చని శాంతిభద్రతల విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆనంద్కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించామని, 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు