అక్రమ స్ట్రీట్ వెండర్స్పై కఠిన చర్యలు
- October 21, 2017మనామా: క్యాపిటల్ గవర్నరేట్, అక్రమ స్ట్రీట్ వెండర్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గవర్నరేట్ పరిధిలోని సెంట్రల్ మార్కెట్స్లో ఉన్న అక్రమ స్ట్రీట్ వెండర్స్ని తొలగించాల్సిందిగా ఆదేశాలు అందడంతో, తగు చర్యలు కూడా చేపట్టారు. క్యాపిటల్ సెంట్రల్ జనరల్ సెక్రెటేరియట్ ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. మార్కెట్స్ రెగ్యులేషన్ అండ్ మెయిన్టెనెన్స్ హెడ్ మొహమ్మద్ అబ్దుల్సలామ్ మాట్లాడుతూ, మునిసిపాలిటీ 17 మంది వ్యాపారులను హెచ్చరించినట్లు చెప్పారు. మనామా, జిదాఫ్స్లోని మార్కెట్లకు చెందిన వ్యాపారులు వీరంతా. నాలుగు అక్రమ వెండింగ్ పాయింట్స్ని మనామా సెంట్రల్ మార్కెట్ నుంచి తొలగించడం కూడా జరిగింది. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు సాధారణ ప్రజల నుంచి వచ్చినట్లు అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!