బహ్రెయిన్లో దొంగల ముఠా పట్టివేత
- October 21, 2017మనామా: కింగ్డమ్లోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాని అరెస్ట్ చేశారు పోలీసులు. 70,000 దిర్హామ్లకు పైగా విలువైన వస్తువుల్ని వీరు దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్, ఈ ముఠా ఆరు దొంగతనాలకు పాల్పడినట్లు ధృవీకరించింది. పక్కా వ్యూహంతో ఈ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడుతోందని అధికారులు చెప్పారు. సీసీ టీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనాల కోసం నిందితులు యూజ్డ్ కార్లను వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ జారీ చేసిన అరెస్ట్ వారెంట్తో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..