యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- May 03, 2024
అబుదాబి: అల్ ఐన్ ప్రాంత పాలకుడు షేక్ తహ్నూన్ బిన్ మొహమ్మద్ అల్ నహ్యాన్ మరణంపై హిస్ మెజెస్టి సుల్తాన్ హైతామ్ బిన్ తారిక్ సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు అబుదాబిలోని అల్ ముష్రిఫ్ ప్యాలెస్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ను కలిసిన అంతర్జాతీయ సంబంధాలు మరియు సహకార వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి హెచ్హెచ్ సయ్యద్ అసద్ బిన్ తారిక్ అల్ సయిద్, సుల్తాన్ హైతామ్ బిన్ తారిక్ తరఫున సంతాప సందేశాన్ని అందజేశారు. వారితోపాటు హెచ్హెచ్ సయ్యద్ అసద్, సంస్కృతి, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి హెచ్హెచ్ సయ్యద్ థెయాజిన్ బిన్ హైతం అల్ సయీద్, దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ మంత్రి సయ్యద్ ఖలీద్ బిన్ హిలాల్ అల్ బుసైదీ, సయ్యద్ హమూద్ బిన్ ఫైసల్ అల్ బుసాయిదీతో కూడిన ప్రతినిధి బృందం యూఏఈ ప్రెసిడెంట్ ను కలిసి సంతాపాన్ని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







