దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- May 03, 2024
దుబాయ్: దుబాయ్లో కలరా కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 16న రికార్డు స్థాయిలో భారీ వర్షపాతం కారణంగా ఎమిరెట్స్ లోని కొన్ని ప్రాంతాలు వరదలకు గురయ్యాయని, ఆనంతరం అక్యూట్ డయేరియా ఇన్ఫెక్షన్ గురించిన ఆందోళనలను ప్రస్తావిస్తూ, దుబాయ్లో ఎటువంటి కేసులు లేవని అధికారులు తెలిపారు. "కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ఛానెల్లపై ఆధారపడాలని మేము ప్రజలకు సలహా ఇస్తున్నాము. అన్ని సీజన్లు మరియు వాతావరణ పరిస్థితులలో నివారణ చర్యలను సిఫార్సు చేస్తున్నాము" అని దుబాయ్ మీడియా ఆఫీస్ ఒక ప్రకటనలో పేర్కొంది. దుబాయ్లో వర్షాల కారణంగా నీరు కలుషితమైందన్న పుకార్లను అధికారులు ఖండించారు. ముందుజాగ్రత్తగా, పేరుకుపోయిన వర్షపు నీరు మరియు నిలిచిపోయిన నీటిని తీసి వేయాలని ప్రజలకు సలహా జారీ చేశారు. విరేచనాలు మరియు వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం పొందాలని దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA) సూచించింది.ఇంటి చుట్టూ ఉన్న గ్రౌండ్ మురుగు కాలువలు మరియు నీటి పారుదల నెట్వర్క్లు బ్లాక్ అయితే, నివాసితులు వెంటనే 800900లో దుబాయ్ మునిసిపాలిటీ కాల్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







