దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- May 03, 2024
దుబాయ్: దుబాయ్లో కలరా కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 16న రికార్డు స్థాయిలో భారీ వర్షపాతం కారణంగా ఎమిరెట్స్ లోని కొన్ని ప్రాంతాలు వరదలకు గురయ్యాయని, ఆనంతరం అక్యూట్ డయేరియా ఇన్ఫెక్షన్ గురించిన ఆందోళనలను ప్రస్తావిస్తూ, దుబాయ్లో ఎటువంటి కేసులు లేవని అధికారులు తెలిపారు. "కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ఛానెల్లపై ఆధారపడాలని మేము ప్రజలకు సలహా ఇస్తున్నాము. అన్ని సీజన్లు మరియు వాతావరణ పరిస్థితులలో నివారణ చర్యలను సిఫార్సు చేస్తున్నాము" అని దుబాయ్ మీడియా ఆఫీస్ ఒక ప్రకటనలో పేర్కొంది. దుబాయ్లో వర్షాల కారణంగా నీరు కలుషితమైందన్న పుకార్లను అధికారులు ఖండించారు. ముందుజాగ్రత్తగా, పేరుకుపోయిన వర్షపు నీరు మరియు నిలిచిపోయిన నీటిని తీసి వేయాలని ప్రజలకు సలహా జారీ చేశారు. విరేచనాలు మరియు వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం పొందాలని దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA) సూచించింది.ఇంటి చుట్టూ ఉన్న గ్రౌండ్ మురుగు కాలువలు మరియు నీటి పారుదల నెట్వర్క్లు బ్లాక్ అయితే, నివాసితులు వెంటనే 800900లో దుబాయ్ మునిసిపాలిటీ కాల్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









