యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- May 03, 2024
యూఏఈ: యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండటంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. చాలా మంది నివాసితులు ఇళ్లకే పరిమితం అయ్యారు. శుక్రవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. పార్కులు మరియు బీచ్లు మూసివేశారు. విమానాశ్రయాలు మరియు విమానయాన సంస్థలు వాతావరణ పరిస్థితులను బట్టి సర్వీసులను మళ్లింపు, రద్దు చేస్తున్నారు. జాతీయ వాతావరణ కేంద్రం (NCM) జారీ చేసిన హెచ్చరికల ప్రకారం గురువారం దుబాయ్లో తెల్లవారుజామున 2.35 గంటలకే వర్షాలు ప్రారంభం అయ్యాయి. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. దుబాయ్ RTA ఇంటర్సిటీ బస్సు సేవలను నిలిపివేసింది. అనంరతం ప్రారంభించింది. షార్జా ఆర్టీఏ గురువారం రాత్రి 9 గంటల తర్వాత ఇంటర్సిటీ బస్సు సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







