హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- May 03, 2024
రియాద్: రాబోయే హజ్ 2024 వార్షిక తీర్థయాత్ర కోసం సౌదీ హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ నుసుక్ యాత్రికుల కార్డ్ను ఆవిష్కరించిది. ది. హజ్ మరియు ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫిక్ అల్-రబియా, ఇండోనేషియాలో తన అధికారిక పర్యటన సందర్భంగా నుసుక్ కార్డ్ని విడుదల చేశారు. హజ్ కోసం అత్యధికంగా (241000 మంది )యాత్రికులను పంపుతున్న ముస్లిం దేశమైన ఇండోనేషియా యాత్రికుల కోసం సేవలను క్రమబద్ధీకరించడానికి తుది సన్నాహాలు చర్చించారు. తీర్థయాత్రను మరింత సులభతరం చేయడానికి, చట్టవిరుద్ధమైన మార్గంలో హజ్ చేసే సందర్భాలను తగ్గించడానికి రాబోయే హజ్ సీజన్ కోసం కార్యాచరణ ప్రక్రియలో భాగంగా నుసుక్ యాత్రికుల కార్డ్ ను ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్డ్ డిజిటల్ మరియు ఫిజికల్ (ప్రింట్) ఫార్మాట్లలో ఉందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కార్డ్ ప్రింట్ కాపీ యాత్రికులకు వారి సంబంధిత హజ్ మిషన్లు లేదా హజ్ సర్వీస్ అందించే కంపెనీలు, యాత్రికులు తీర్థయాత్ర చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల ద్వారా పంపిణీ చేయబడుతుందని తెలిపారు. సౌదీకి రాకముందే యాత్రికులు కార్డును పొందాలని హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







