హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- May 03, 2024
రియాద్: రాబోయే హజ్ 2024 వార్షిక తీర్థయాత్ర కోసం సౌదీ హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ నుసుక్ యాత్రికుల కార్డ్ను ఆవిష్కరించిది. ది. హజ్ మరియు ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫిక్ అల్-రబియా, ఇండోనేషియాలో తన అధికారిక పర్యటన సందర్భంగా నుసుక్ కార్డ్ని విడుదల చేశారు. హజ్ కోసం అత్యధికంగా (241000 మంది )యాత్రికులను పంపుతున్న ముస్లిం దేశమైన ఇండోనేషియా యాత్రికుల కోసం సేవలను క్రమబద్ధీకరించడానికి తుది సన్నాహాలు చర్చించారు. తీర్థయాత్రను మరింత సులభతరం చేయడానికి, చట్టవిరుద్ధమైన మార్గంలో హజ్ చేసే సందర్భాలను తగ్గించడానికి రాబోయే హజ్ సీజన్ కోసం కార్యాచరణ ప్రక్రియలో భాగంగా నుసుక్ యాత్రికుల కార్డ్ ను ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్డ్ డిజిటల్ మరియు ఫిజికల్ (ప్రింట్) ఫార్మాట్లలో ఉందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కార్డ్ ప్రింట్ కాపీ యాత్రికులకు వారి సంబంధిత హజ్ మిషన్లు లేదా హజ్ సర్వీస్ అందించే కంపెనీలు, యాత్రికులు తీర్థయాత్ర చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల ద్వారా పంపిణీ చేయబడుతుందని తెలిపారు. సౌదీకి రాకముందే యాత్రికులు కార్డును పొందాలని హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







