అమరవీరుల కుటుంబాలకు అక్షయ్ కుమార్ కానుక దీపావళి.!
- October 21, 2017అమరవీరులైన సైనికుల కుటుంబాలను ఆదుకోవడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ ఎప్పుడూ ముందుంటారు. వాళ్ల కుటుంబాలకు వీలైన సహాయం చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్ రేంజ్కు చెందిన దాదాపు 103 అమరవీరుల కుటుంబాల్లో ఆయన ఆనందం నింపారు. వారి కోసం చెక్కు పంపిస్తూ.. మనసుకు హత్తుకునే విధంగా ఓ ప్రత్యేక సందేశాన్ని పంపించారు. విధులు నిర్వహిస్తూ అమరులైన పోలీసులు, పారామిలటరీ బలగాలు, సైనికుల సమాచారాన్ని కొల్హాపూర్ అధికారులతో కలిసి సేకరించారు.
దాదాపు 103 మంది అమరవీరుల కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి రూ.25వేల చెక్కును పంపించారు. దాంతో పాటు ఓ లేఖను, చిన్నారుల కోసం పుస్తకాలు, స్వీట్లు పంపించారు. 'దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్న సిబ్బంది కుటుంబసభ్యులైన మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ దీపావళి పండుగ నాడు మీ ప్రియమైన వారితో గడపలేకపోతున్నారని నాకు తెలుసు. కానీ మీరు ధైర్యంతో సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. మీ కోసం మిఠాయిలు, చిన్నారుల కోసం పుస్తకాలు పంపిస్తున్నా. ప్రేమతో అంగీకరించండి' అని లేఖను కూడా అక్కీ పంపారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్