రోహ్‌తంగ్ పాస్‌ను మూసివేసిన హిమాచల్ సర్కారు

- November 17, 2017 , by Maagulf
రోహ్‌తంగ్ పాస్‌ను మూసివేసిన హిమాచల్ సర్కారు

మనాలి: హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తోంది.హిమపాతం రోడ్లను కప్పేసింది. దీంతో హిమాచల్‌లోని రోహ్ తాంగ్ పాస్‌ను మూసివేశారు. మార్చి వరకు రోహ్ తాంగ్ పాస్‌ను మూసేస్తామని హిమాచల్‌ప్రదేశ్ సర్కార్ తెలిపింది.
రోహ్ తాంగ్ పాస్‌లో ఉష్ణోగ్రత మైనస్ రెండు డిగ్రీలకు పడిపోయింది. రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఈ సీజన్‌లో మంచు కురవడం ఇదే తొలిసారి. పశ్చిమ కల్లోలమే మంచు పడటానికి ప్రధాన కారణమని వాతావరణ శాఖ తెలిపింది. చలిగాలులు వీస్తుండటంతో జనం వణికిపోతున్నారు. కులూ మనాలీలో మంచు గడ్డకట్టేస్తుండటంతో పర్యాటకులు ఇబ్బందిపడుతున్నారు. గుల్మర్గ్, సోనోమార్గ్, లేహ్ లోనూ భారీగా వర్షం కురుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com