'రక్షణమంత్రి ' అని పిలవండి చాలు
- November 17, 2017న్యూఢిల్లీ: భారత్కు తొలిసారిగా పూర్తికాల మహిళా రక్షణశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ నియమితులైన విషయం తెలిసిందే. గత రెండు నెలలుగా సీతారామన్ దేశ సరిహద్దులో పహారా కాస్తున్న జవాన్లును కలుసుకొని వారితో మాట్లాడి భద్రతను సమీక్షించారు. అయితే.. ఆమె పర్యటిస్తున్న సమయంలో జవాన్లకు ఓ చిక్కు వచ్చి పడింది. ఆమెను 'మేడమ్' అనాలా.. లేక 'సర్' అనాలా.. అనేది అర్థం కాక జవాన్లు గందరగోళానికి గురయ్యారట. వివిధ సందర్భాల్లో 'జైహింద్ మేమ్సాబ్' అంటే మరోసారి 'జైహింద్ సర్' అంటున్నారు. అసలు ఆమెను ఎలా సంబోధించాలో అర్థం కాక జవాన్లు ఒక్కోరకంగా పిలుస్తున్నారు.
దీనిపై రక్షణశాఖమంత్రి నిర్మలాసీతారామన్ స్పందించారు. తనను సర్.. మేడమ్.. అని అనొద్దని కేవలం 'రక్షణ మంత్రి' అంటే చాలని క్లారిటీ ఇచ్చేశారు. ఎలా పిలవాలా అని గందరగోళానికి గురవుతున్న సైన్యానికి రక్షణ మంత్రి అని పిలవమని చెప్పడం బాగుందని సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 58ఏళ్ల సీతారామన్ రక్షణశాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా నిలిచారు. 1975, 1980-82 కాలంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తాత్కాలికంగా రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం