బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్లో సింధు ఓటమి
- December 17, 2017బ్యాడ్మింటన్లో మరో టైటిల్ ముద్దాడాలన్న తెలుగుతేజం పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఉత్కంఠగా సాగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి యమగూచి చేతిలో ఓటమి పాలయ్యింది. 94 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో 21-15, 12-21, 19-21 తేడాతో సింధు పోరాడి ఓడింది. సింధు-యమగూచి మధ్య జరిగిన ఫైనల్ పోరు హోరాహోరీగా సాగింది. 21-15తో తొలి గేమ్ను కైవసం చేసుకుంది సింధు. అయితే, రెండో గేమ్ను 12-21తో ప్రత్యర్థి కైవసం చేసుకుని సింధుకు సవాల్ విసిరింది. దీంతో టైటిల్ గెలవాలంటే మూడో గేమ్లో గెలుపు తప్పనిసరి. అందరి దృష్టి మూడో గేమ్పైనే. అందుకు తగ్గట్టుగానే చివరి వరకు పోరు హోరాహోరీగా సాగింది. స్కోరు 19-19 వచ్చే వరకు స్కోర్లు చాలా దగ్గరగా వచ్చాయి. చివర్లో ఒత్తిడిని జయిస్తూ యమగూచి వరుసగా రెండు పాయింట్లు సాధించడంతో విజయం ఆమెను వరించింది. దీంతో సింధు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతేడాదే తొలిసారిగా బీడబ్ల్యూఎఫ్ సిరీస్లో అడుగిడిన సింధు. అప్పట్లో సెమీస్ దశను దాటలేకపోయింది. ఈ సారి ఆ దశను దాటినప్పటికీ కీలకమైన టైటిల్ పోరులో వెనకబడిపోయింది.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం