లిబియాలో కారు బాంబు పేలుళ్లు..33 మంది దుర్మరణం
- January 23, 2018లిబియా: లిబియాలో గుర్తు తెలియని దుండగులు కారు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. సెంట్రల్ అల్ సల్మనీ జిల్లా పశ్చిమ బెన్ఘాజీ పట్టణంలోని మసీదు ప్రాంగణంలో ఈ పేలుళ్లు సంభవించాయి. బాంబు పేలుళ్లలో 33మంది ప్రాణాలు కోల్పోగా..మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులకు తరలించారు. సమాచారమందుకున్న భద్రతాబలగాలు, వైద్య శాఖ అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే వారు అక్కడికి వచ్చిన 15 నిమిషాల సమయంలోనే మరో భారీ బాంబు పేలుడు సంభవించింది. రెండోసారి జరిగిన పేలుడులో అంబులెన్స్లో ఉన్న చాలా మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిలో మిలటరీ దళాలు, వైద్య సిబ్బంది, ప్రజలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది పరిస్థితి విషమంగా ఉన్నదని..మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. అయితే ఈ దాడులకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవలి కాలంలో లిబియాలోని మసీదు పరిసర ప్రాంతాల్లో తరచూ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్