యెమెన్కు 1.5బిలియన్ డాలర్ల సౌదీ మిత్రదేశాల సాయం
- January 23, 2018
సనా : యెమెన్కు 1.5బిలియన్ డాలర్ల ( రూ.9,566 కోట్లు ) సాయం అందజేయనున్నట్టు సౌదీ మిత్రదేశాలు ప్రకటించాయి. ఐరాస అభ్యర్థన మేరకు తామీ సాయం చేయనున్నట్టు పేర్కొన్నాయి. యెమెన్లో 2015లో అంతర్యుద్ధం చెలరేగింది. యుద్ధవాతావరణం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంతర్యుద్ధం కారణంగా దాదాపు 10వేల మంది చనిపోయారు. లక్షలాది మంది ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. ప్రాథమిక అవసరాలు అందక ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులుపడుతున్నారు. అంతేగాకుండా, అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఆకలికేకలతో యెమెన్ తల్లడిల్లుతోంది. ఈ నేపథ్యంలో యెమెన్ పౌరులకు సాయం అందించాలని ప్రపంచ దేశాలకు ఇటీవల ఐరాస పిలుపునిచ్చింది. ఐరాస నివేదిక ప్రకారం...యెమెన్లో 2కోట్ల 20లక్షల మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు.80లక్షల మంది అర్ధాకలితో అలమటిస్తున్నారు. వారిలో 18లక్షల మంది చిన్నారులు ఐదేండ్ల లోపువారున్నారు. యెమెన్లో కలరా వ్యాధి వ్యాపించడంతో ప్రజలు అనేక ఇబ్బందులుపడుతున్నారు. సౌదీ మిత్రదేశాలు తమకు సహకరిస్తున్నందుకు యెమెన్ అధ్యక్షుడు అబ్దు రబు మన్సూర్ హాదీ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







