రాత్రి 9 తర్వాత పెళ్లిళ్లు వద్దు ....
- January 23, 2018హైదరాబాద్:ఇక నుంచి హైదరాబాద్ నగరంలో రాత్రి తొమ్మిది గంటల తర్వాత వివాహాలు చేయాలంటే ఆలోచించాల్సిందే.. ఎందుకంటే అలా రాత్రి 9 తర్వాత పెళ్లిళ్లు చేస్తే కఠిన చర్యలు చేసుకొంటామని తెలంగాణ వక్ఫ్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. రాత్రివేళ 9 తర్వాత ముస్లింలు ఫంక్షన్ హల్స్ లో వివాహాలు చేసుకొంటున్నందున ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అందుకనే ఇక నుంచి ఫిబ్రవరి 1 నుంచి రాత్రివేళ నగరంలో వివాహాలు నిషేధం పై ఉత్తర్వులు జారీ.. ఈ విషయం ను వక్ఫ్ బోర్డు చైర్మెన్ మహమ్మద్ సలీం ప్రకటించారు.
ఇక నుంచి రాత్రి వేళ 9 తర్వాత ఎవరైనా వివాహం చేస్తే.. ఆ ఖాజీలకు నోటీసులు జారీచేయడంతో పాటు.. వారికి వివాహ బుక్ లెట్ సర్టిఫికెట్లు జారీ చేయమని చెప్పారు. రాత్రివేళ సంగీతం జోరులో.. బాణాసంచా కాల్చడంతో ప్రజలకు అసౌకర్యంగా కలుగుతుందని భావించి రాత్రివేళ వివాహాలను రద్దు చేయడం శుభపరిణామమని ముస్లిం మత పెద్దలు వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన