టెర్రరిస్ట్ల నుంచి అమర్నాథ్ యాత్రికులను కాపాడిన డ్రైవర్కు రెండో అత్యుత్తమ సాహస అవార్డు
- January 24, 2018శ్రీనగర్: కొద్ది నెలల క్రితం ఉగ్రవాదుల నుంచి 52 మంది అమర్నాథ్ యాత్రికులను కాపాడిన గుజరాత్కు చెందిన బస్సు డ్రైవర్ షేక్ సలీం గఫూర్ ఉత్తమ్ జీవన్ రక్షా పాదక్ అవార్డుకు ఎంపికయ్యారు. అరుదైన సాహసాన్ని ప్రదర్శించే పౌరులకు ఇది ఇస్తారు.
భారత గణతంత్ర దినం సందర్భంగా ఈ అవార్డును ప్రకటించారు. ఈ మేరకు హోంశాఖ బుధవారం ఓ ప్రకటన చేసింది. ఈ తరహా అవార్డుల్లో దీనిని రెండో ఉత్తమ పురస్కారంగా పేర్కొంటారు.
గత ఏడాది జూలై 10వ తేదీన గుజరాత్కు చెందిన బస్సులో యాత్రికులను తీసుకొని అనంత్ నాగ్ జిల్లా బటేంగూ ప్రాంతానికి వచ్చిన సమయంలో తీవ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో ఆరుగురు యాత్రికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. చుట్టూ చీకటి ఉన్నా తీవ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా గఫూర్ గుండెధైర్యంతో బస్సును ముందుకు పోనిచ్చి, యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఈయనకు ఈ అవార్డు ఇచ్చారు. దీంతో పాటు 26వ తేదీ తర్వాత జరిగే మరో కార్యక్రమంలో రూ.లక్ష నగదుతో పాటు పురస్కారంతో సత్కరిస్తారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం