ఆ వార్తల్లో నిజం లేదు అని కొట్టిపారేసిన : దర్శకేంద్రుడు

- January 24, 2018 , by Maagulf
ఆ వార్తల్లో నిజం లేదు అని కొట్టిపారేసిన  : దర్శకేంద్రుడు

టీటీడీ ఛైర్మన్‌గా తాను బాధ్యతలు చేపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు ప్రముఖ దర్శకుడు, టీటీడీ బోర్డు సభ్యుడు కె.రాఘవేంద్రరావు. బోర్డ్ ఛైర్మన్‌గా రాఘవేంద్రరావు బాధ్యతలు చేపడుతున్నట్లు గత రెండు, మూడు రోజులుగా కొన్ని పత్రికలు, సోషల్‌మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలను ఆయన కొట్టిపారేశారు.

'నేను టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడుతున్నానని వార్తలు వస్తుండడంతో వేలాది మంది అభినందనలు తెలుపుతున్నారు. ఎస్వీఎస్సీ ఛానెల్‌ ద్వారా స్వామివారికి సేవ చేస్తున్నాను. శ్రీవారికి చెందిన కార్యక్రమాలను మరింత వైవిధ్యంగా రూపొందించి భక్త జనకోటిని అలరిస్తూ ఆయన సేవలో తరించాలన్నది నా కోరిక.' అని దర్శకేంద్రుడు ట్వీట్ చేశారు. దీంతో ఆ వార్తలు తెరపడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com