తెలంగాణలోని జీనోమ్ వ్యాలీ క్లస్టర్ ఆసియాలోనే అతిపెద్దది: మంత్రి కేటీఆర్
- February 22, 2018తెలంగాణలో సులభతర వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. జీనోమ్ వ్యాలీని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో బయో ఏషియా సదస్సును కేటీఆర్ ప్రారంభించారు. ఈ సదస్సు మూడు రోజులపాటు జరుగుతుంది. ఈ సదస్సుకు 52 దేశాల నుంచి 1600 మంది ప్రతినిధులు తరలివచ్చారు. రాష్ట్రంలోని జీనోమ్ వ్యాలీ క్లస్టర్ ఆసియాలోనే అతిపెద్దదని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ చెప్పారు. జీనోమ్ వ్యాలీకి ఫార్మా కంపెనీలను ఆహ్వానిస్తున్నామన్నారు. వ్యాక్సిన్ల అభివృద్ధికి ప్రభుత్వం మరింత దృష్టి పెట్టిందన్న కేటీఆర్.. లైఫ్ సైన్సెస్ రంగంలో అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం