లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- May 20, 2024
ఛత్తీస్గడ్: ఛత్తీస్గడ్లోని కబీర్ధామ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పికప్ వాహనం ఓ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 18 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుక్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహపానీ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
బైగా గిరిజన తెగకు చెందిన 25 నుంచి 30 మంది అడవి నుంచి టెండు ఆకుల తెంపుకుని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న పికప్ వాహనం బహపానీ ప్రాంతం సమీపంలో ఓ మలుపు వద్ద అదుపు తప్పి సుమారు 20 అడుగుల లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా.. కొందరు ఘటనాస్థలంలోనే మరణించగా మరికొందరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా కుయ్ నివాసితులు అని చెప్పారు.
బైగా కమ్యూనిటీ బీడీ తయారీ చేస్తుంటారు. ఇందుకోసం వీరు వారు టెండు ఆకులను సేకరింస్తుంటారు. ఈ ఆకులను బీడీలు చుట్టడానికి ఉపయోగిస్తారు.
ఈ ప్రమాదం పై ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!
- పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి: కువైట్
- బహ్రెయిన్ లో హీట్ వేవ్స్.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!
- అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్ లో ఫ్రీ ఫ్లైట్ పారట్ షో..!!
- సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన తేళ్ల కస్తూరి
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..
- ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!
- కీసర పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి సీపీ సుమతి









