లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- May 20, 2024
ఛత్తీస్గడ్: ఛత్తీస్గడ్లోని కబీర్ధామ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పికప్ వాహనం ఓ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 18 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుక్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహపానీ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
బైగా గిరిజన తెగకు చెందిన 25 నుంచి 30 మంది అడవి నుంచి టెండు ఆకుల తెంపుకుని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న పికప్ వాహనం బహపానీ ప్రాంతం సమీపంలో ఓ మలుపు వద్ద అదుపు తప్పి సుమారు 20 అడుగుల లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా.. కొందరు ఘటనాస్థలంలోనే మరణించగా మరికొందరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా కుయ్ నివాసితులు అని చెప్పారు.
బైగా కమ్యూనిటీ బీడీ తయారీ చేస్తుంటారు. ఇందుకోసం వీరు వారు టెండు ఆకులను సేకరింస్తుంటారు. ఈ ఆకులను బీడీలు చుట్టడానికి ఉపయోగిస్తారు.
ఈ ప్రమాదం పై ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- HR88B8888 నంబర్కు అపార డిమాండ్
- హైదరాబాద్: సస్పెండ్ చేసిన ఎస్ఐ పై షాకింగ్ నిజాలు
- లోక్సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్
- 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం
- హాంకాంగ్లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?







