ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- May 20, 2024
యూఏఈ: ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంపై అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ సంతాపం తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ Xలో ఒక పోస్ట్ చేశారు. "ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్-అబ్దోల్లాహియాన్ ఒక విషాద ప్రమాదంలో మరణించడం బాధాకరం. ఇరాన్ ప్రభుత్వానికి, ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి. వారి కుటుంబాలకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్న." అని పేర్కొన్నారు. యూఏఈ ఉపాధ్యక్షుడు మరియు ప్రధాన మంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా సంతాపం తెలియజేశారు.
అజర్బైజాన్ సరిహద్దు సమీపంలోని పర్వత ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్దొల్లాహియాన్, ఇతర ప్రముఖులు మరణించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు NATS భారీ విరాళం
- దుబాయ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ పై కొత్త చట్టం జారీ చేసిన షేక్ మహ్మద్
- కువైట్ జైలు నుంచి ముగ్గురు ఖైదీలు పరార్.. దేశవ్యాప్తంగా ముమ్మర గాలింపు
- తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు నో పర్మిషన్..
- ఆరు నెలలకే తొలగింపు.. కోల్కతాలో మెస్సీ విగ్రహం తొలగింపు
- దేశవ్యాప్తంగా 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి మునిరత్నం నాయడుకు ఘనస్వాగతం
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!









