ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం

- May 20, 2024 , by Maagulf
ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం

యూఏఈ: ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంపై అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ సంతాపం తెలిపారు.  ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఒక పోస్ట్ చేశారు. "ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్-అబ్దోల్లాహియాన్ ఒక విషాద ప్రమాదంలో మరణించడం బాధాకరం. ఇరాన్ ప్రభుత్వానికి, ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి. వారి కుటుంబాలకు మనో ధైర్యాన్ని  ప్రసాదించాలని ప్రార్థిస్తున్న." అని పేర్కొన్నారు.  యూఏఈ ఉపాధ్యక్షుడు మరియు ప్రధాన మంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా సంతాపం తెలియజేశారు. 

అజర్‌బైజాన్ సరిహద్దు సమీపంలోని పర్వత ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్దొల్లాహియాన్, ఇతర ప్రముఖులు మరణించిన విషయం తెలిసిందే.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com