ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- May 20, 2024
యూఏఈ: ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంపై అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ సంతాపం తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ Xలో ఒక పోస్ట్ చేశారు. "ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్-అబ్దోల్లాహియాన్ ఒక విషాద ప్రమాదంలో మరణించడం బాధాకరం. ఇరాన్ ప్రభుత్వానికి, ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి. వారి కుటుంబాలకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్న." అని పేర్కొన్నారు. యూఏఈ ఉపాధ్యక్షుడు మరియు ప్రధాన మంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా సంతాపం తెలియజేశారు.
అజర్బైజాన్ సరిహద్దు సమీపంలోని పర్వత ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్దొల్లాహియాన్, ఇతర ప్రముఖులు మరణించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







