రజినీనైనా విమర్శించటానికి వెనుకాడను: కమల్
- March 13, 2018చెన్నై: రజినీ రాజకీయ పార్టీ విధానాలు, సిద్ధాంతాలు సక్రమంగా లేకపోతే ఆయనను విమర్శించడానికి మొహమాటపడబోనని 'మక్కల్ నీతి మయ్యం' పార్టీ అధినేత కమల్హాసన్ స్పష్టం చేశారు. అయితే రజినీని రాజకీయంగానే విమర్శిస్తానని, వ్యక్తిగత విమర్శలకు దిగనని కమల్ తేల్చి చెప్పారు. ఓ తమిళ చానల్ ఏర్పాటు చేసిన వేడుకలో మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లోకి రజినీ రాకను ఆయన ఆహ్వానించారు. ప్రజల సంక్షేమమే తమ పార్టీ ప్రధాన సిద్ధాంతమని ఇప్పటికే ప్రకటించామని, రజినీ పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉంటాయో చూద్దామని కమల్ వ్యాఖ్యానించారు. సిద్ధాంతపరంగా ఏవైనా విభేదాలొస్తే రజినీని విమర్శిస్తానని, అది తమ పార్టీ హుందాతనమని ఆయన తెలిపారు. రాజకీయ సిద్ధాంతాలు సరైనవి కాకపోతే ఏ పార్టీని విమర్శించడానికీ వెనకాడబోనని కమల్హాసన్ స్పష్టం చేశారు. రజినీకాంత్ కూడా రాజకీయ పార్టీని స్థాపించి.. ప్రజలకు సేవ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. నటనలో ప్రేక్షకులతో జేజేలు పలికించుకున్న వీరిద్దరూ రాజకీయాల్లో ఏ మేరకు రాణిస్తారోనన్న ఉత్కంఠ తమిళ ప్రజల్లో నెలకొంది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన