చనిపోయి రెండు వారాలైనా స్వదేశానికి చేరని మృతదేహం
- March 18, 2018మనామా: రెండు వారాల క్రితం ప్రాణాలు కోల్పోయిన ఫుట్బాల్ కోచ్ పార్దీవ దేహం, ఇండియాలోని కేరళ స్టేట్కి చేరుకోకపోవడంతో మృతుడి బంధువుల మానసిక వేదన రోజురోజుకీ పెరిగిపోతోంది. 'రెండు వారాల క్రితం మా ఫాదర్ ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడు ఆయన మృతదేహం స్వదేశానికి వస్తోందో అర్థం కావడంలేదు. స్పాన్సర్తో మాట్లాడానుగానీ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ కారణంగా కేసు పెండింగ్లో వుంది. ఫార్మాలిటీస్ పూర్తయ్యాకనే పార్దీవ దేహాన్ని పంపించడానికి వీలవుతుందని చెప్పారు' అంటూ మృతుడు తిలకన్ ఒండాయంకర్యాన్ తనయుడు వైషాక్ తిలకన్ చెప్పారు. 'మేం ఏమీ చేయలేని పరిస్థితుల్లో వున్నాం' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైషాక్. ఆత్మహత్య కారణంగా ఫుట్ బాల్ కోచ్ చనిపోయినట్లు పోస్ట్మార్టమ్ వివరాలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరి 22న ఈ ఘటన చోటు చేసుకుంది. ఇండియన్ టాలెంట్ అకాడమీలో ఫుట్ బాల్ కోచ్గా పనిచేస్తున్న తిలకన్, ఫిబ్రవరి 4 నుంచి ఆచూకీ లేకుండా పోయారు. జెర్సీలను కొనేందుకు మనామా మార్కెట్కి వెళ్ళిన ఆయన ఆ తర్వాత ఎవరికీ అందుబాటులోకి రాలేదు. చివరికి ఆయన మరణ వార్త తెలిసింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్