కుర్దు ప్రాంతాలపై టర్కీ సైన్యం దాడులు
- March 18, 2018ఆఫ్రిన్ : సిరియాలోని కుర్దు ప్రాబల్య ప్రాంతాలపై టర్కీ సైన్యం దాడుల్ని తీవ్రతరం చేసింది. ఆఫ్రిన్ నగరంలో టర్కీ సేనలు పాగా వేశాయి. టర్కీ సైన్యం అండదండలతో సిరియాలో పోరాటం సాగిస్తున్న ప్రయివేటు సేనలు ఈ నగరంలోని కుర్దులను వెళ్లగొడుతున్నాయి. అనంతరం ప్రముఖ కుర్దు నాయకుడి విగ్రహాన్ని సేనలు నేలకూల్చాయి. తమ దేశ సరిహద్దుల్లో ఉన్న కుర్దిష్ మిలిటెంట్లను అంతమొందించేందుకు గత రెండు నెలలుగా సిరియాలో దాడులు జరుపుతున్నామని టర్కీ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.
అయితే, ఈ దాడుల్లో ఇప్పటివరకూ 280 సాధారణ పౌరులు మరణించారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా ఆ ఆరోపణలను టర్కీ ఖండించింది. దీనికంటే ముందు, 'ఫ్రీ సిరియా ఆర్మీ' సేనలు ఆఫ్రిన్ నగరాన్ని ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకున్నాయని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రకటించారు. సేనల దెబ్బకు ఉగ్రవాదులు ఒట్టి చేతులతో పారిపోతున్నారని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం