హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- May 16, 2024
హైదరాబాద్: హైదరాబాద్ లో చాలా చోట్ల భారీ వర్షం కుమ్మేసింది. నేటి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతకు ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రెండు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి నగర ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. మేడ్చల్, సిద్దిపేట, మెదక్, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వైపు వర్షం వ్యాపించింది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కూకట్పల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, రాంనగర్, కోఠి, బేగంబజార్, మెహిదీపట్నం, మాసబ్ట్యాంక్, హైటెక్సిటీ, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
అంతేకాక ఉప్పల్ ప్రాంతంలోనూ దట్టమైన మేఘాలు ఆవరించాయి. ఈరోజు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా ప్లే ఆఫ్ దశకు చేరాలంటే ఈ మ్యాచ్ లో గెలుపు సన్ రైజర్స్ కు ఎంతో అవసరం.
అయితే, ఉప్పల్ పరిసరాల్లో వర్షం పడే అవకాశం ఉండడంతో సన్ రైజర్స్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అటు, ముందుజాగ్రత్తగా ఉప్పల్ స్టేడియంలో పిచ్ ను గ్రౌండ్ సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. అవుట్ ఫీల్డ్ లో కూడా చాలా భాగం కవర్లతో కప్పివేశారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







