మేం రేప్ చేయలేదు.. మాకు నార్కో పరీక్ష చేయండి..
- April 16, 2018కతువా: జమ్మూకశ్మీర్లోని కతువా రేప్ కేసులో నిందితులుగా ఉన్న 8 మంది ఇవాళ జిల్లా కోర్టు ముందు హాజరయ్యారు. ఆ అత్యాచారంతో తమకు సంబంధం లేదని, తమకు నార్కో పరీక్ష నిర్వహించాలని నిందితులు జడ్జిను కోరారు. అయితే ఈ కేసులో తీర్పును ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జిల్లా సెషన్స్ జడ్జి సంజయ్ గుప్తా తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. అయితే ఈకేసులో చార్జ్షీట్ కాపీలను తన ముందు పెట్టాలని జడ్జి ఆ రాష్ట్ర క్రైం బ్రాంచ్ పోలీసులను కోరారు. మరోవైపు నిందితులందరూ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ దగ్గర బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దాని విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేశారు. స్థానిక తెగలకు చెందిన కొందరు ఓ 8 ఏళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి రేప్ చేసినట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు తమ చార్జ్షీట్లో రాశారు. జైలులో ఇవాళ వాదనలు ముగిసిన తర్వాత మళ్లీ నిందితులను పూర్తి భద్రత మధ్య కారాగారానికి తరలించారు. తనకు నార్కో పరీక్ష నిర్వహించాలని ప్రధాన నిందితుడు సాంజీ రామ్ డిమాండ్ చేశారు. చిన్నారి అత్యాచారం, హత్య వెనుక కుట్ర ఉన్నదని, తన తండ్రికి ఆ ఘటనతో సంబంధం లేదని, ఈ కేసును సీబీఐ విచారించాలని సాంజీ రామ్ కూతురు డిమాండ్ చేసింది.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం