వైఎస్సార్ సతీమణిగా రమ్యకృష్ణ!
- April 19, 2018


టాలీవుడ్లో దివంగత సీఎం వైఎస్సార్ బయోపిక్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినీ తారలైన మహానటి సావిత్రి, మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా సినిమాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో మొదటి సారిగా రాజకీయ నేతపై సినిమా తీస్తున్నారు. మహి వి.రాఘవ్ దర్శకత్వంలో 'యాత్ర' సినిమాతో మళియాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. వైఎస్సార్ బయోపిక్లో జగన్ భార్య పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నట్లు టాక్ వస్తోంది.ఆనందో బ్రహ్మ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న మహి వి. రాఘవ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాలో జగన్ పాత్రలో తమిళ హీరో సూర్య చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా రూ.30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కనుందని.. విజయ్ చిల్లా.. దేవిరెడ్డి శశి ఈ సినిమాకు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో రాజశేఖర రెడ్డి పాత్ర మళియాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా..ఆయన సతీమణి పాత్రలో నయనతారను ఎంపిక చేసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి.
తాజాగా నయనతార ప్లేస్ లో బాహబలిలో శివగామిగా అద్భుత నటన ప్రదర్శించిన నటి రమ్యకృష్ణను తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పాత్రకి రమ్యకృష్ణ అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించి, ఆమెను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
ప్రజలకు ఎన్నో ఉపాధి పథకాలు..అభివృద్ది సంక్షేమ పథకాలు తీసుకు వచ్చారు. రైతుల శ్రేయస్సు కోసం ఎన్నో పథకాలు తీసుకు వచ్చారు..అందుకే ఆయన ప్రజా నాయకుడు అయ్యారు. రచ్చబండ కార్యక్రమానికి వెళ్తు హెలికాప్టర్ ప్రమాదంలో అసువులుబాశారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న ఈ సినిమాపై వైఎస్ఆర్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







