భాగ్యనగరం లో సచిన్ సందడి
- April 19, 2018
మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ హైదరాబాద్లో సందడి చేశాడు. కెపిహెచ్బి ఫోరమ్ మాల్లో స్మాష్ గేమింగ్ జోన్ను సచిన్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా నిర్వహించిన నేషనల్ బౌలింగ్ టోర్నీలో విజేతలకు బహుమతులు అందజేశాడు. సచిన్ రాకతో మాల్ అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఒక దశలో అభిమానులను కట్టడి చేసేందుకు పోలీసులు , నిర్వాహకులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీంతో సచిన్ చాలాసేపు మాల్లో ఏర్పాటు చేసిన వేదిక దగ్గరకి రాలేకపోయాడు. కాగా తల్లిదండ్రులు తమ చిన్నారులను క్రీడల్లో ప్రోత్సహించాలని సచిన్ సూచించాడు. క్రికెట్టే కాకుండా ఏ క్రీడల్లోనైనా తమ పిల్లలను ప్రోత్సహించాల్సిన బాధ్యత వారిదేనని వ్యాఖ్యానించాడు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







