భాగ్యనగరం లో సచిన్ సందడి
- April 19, 2018
మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ హైదరాబాద్లో సందడి చేశాడు. కెపిహెచ్బి ఫోరమ్ మాల్లో స్మాష్ గేమింగ్ జోన్ను సచిన్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా నిర్వహించిన నేషనల్ బౌలింగ్ టోర్నీలో విజేతలకు బహుమతులు అందజేశాడు. సచిన్ రాకతో మాల్ అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఒక దశలో అభిమానులను కట్టడి చేసేందుకు పోలీసులు , నిర్వాహకులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీంతో సచిన్ చాలాసేపు మాల్లో ఏర్పాటు చేసిన వేదిక దగ్గరకి రాలేకపోయాడు. కాగా తల్లిదండ్రులు తమ చిన్నారులను క్రీడల్లో ప్రోత్సహించాలని సచిన్ సూచించాడు. క్రికెట్టే కాకుండా ఏ క్రీడల్లోనైనా తమ పిల్లలను ప్రోత్సహించాల్సిన బాధ్యత వారిదేనని వ్యాఖ్యానించాడు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







