భాగ్యనగరం లో సచిన్ సందడి
- April 19, 2018
మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ హైదరాబాద్లో సందడి చేశాడు. కెపిహెచ్బి ఫోరమ్ మాల్లో స్మాష్ గేమింగ్ జోన్ను సచిన్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా నిర్వహించిన నేషనల్ బౌలింగ్ టోర్నీలో విజేతలకు బహుమతులు అందజేశాడు. సచిన్ రాకతో మాల్ అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఒక దశలో అభిమానులను కట్టడి చేసేందుకు పోలీసులు , నిర్వాహకులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీంతో సచిన్ చాలాసేపు మాల్లో ఏర్పాటు చేసిన వేదిక దగ్గరకి రాలేకపోయాడు. కాగా తల్లిదండ్రులు తమ చిన్నారులను క్రీడల్లో ప్రోత్సహించాలని సచిన్ సూచించాడు. క్రికెట్టే కాకుండా ఏ క్రీడల్లోనైనా తమ పిల్లలను ప్రోత్సహించాల్సిన బాధ్యత వారిదేనని వ్యాఖ్యానించాడు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







