'భరత్ అనే నేను' విజయోత్సవ వేడుకకు రంగం సిద్ధం
- April 24, 2018
సూపర్ స్టార్ మహేష్ బాబు, కైరా అద్వాని జంటగా నటించిన 'భరత్ అనే నేను' సినిమా బ్లాక్బస్టర్ దిశగా దూసుకుపోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా అదరగొట్టేశాడు. మహేష్ నటన, దేవి శ్రీ సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంచనాలను మించి పరుగులు పెడుతోంది.
భారీ కల్లెక్షన్స్తో కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్న ఈ సినిమా పట్ల పలువురు సినీ ప్రముఖులు సైతం తమ నీరాజనాలు తెలిపారు. ఓ వైపు కలెక్షన్ల సునామీ, మరోవైపు సినీ ప్రముఖుల ప్రశంసలతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగి తేలుతోంది. ఇచ్చిన హామీ నెరవేర్చామని తెగ సంబర పడుతున్న టీమ్.. 'భరత్' విజయోత్సవ వేడుక చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ వేడుకకు తిరుపతి వేదిక కానుంది. తిరుపతిలోని అలిపిరి రోడ్లో ఉన్న నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్లో ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు కొద్దిసేపటిక్రితమే అఫీషియల్ ప్రకటన బయటకు వచ్చింది.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









