లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- December 13, 2025
హైదరాబాద్: హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జట్ల మధ్య ఇవాళ ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది.
మెస్సీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా నిర్వహించిన ఈ మ్యాచ్లో మెస్సీ టీమ్పై సింగరేణి ఆర్ఆర్ టీమ్ 3-0 గోల్స్తో గెలిచింది. ఆర్ఆర్ టీమ్ తరఫున సీఎం రేవంత్రెడ్డి ఆడి ఓ గోల్ కొట్టారు. ఇందులో మెస్సీ, రేవంత్ రెడ్డి ఆడింది 5 నిమిషాలపాటే.
అనంతరం, ఇరు జట్లకు మెస్సీ పతకాలు అందజేశారు. ఇక్కడకు వచ్చి తెలుగు వారిని కలవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక్కడి వారు చూపించిన అభిమానం ఎంతో శక్తినిచ్చిందని చెప్పారు.
కాగా, మ్యాచ్కి ముందు ఇరు టీమ్లతో మెస్సీ, రేవంత్ రెడ్డి ఫొటోలు దిగారు. ఈ మ్యాచ్ను రాహుల్ గాంధీ కూడా చూశారు. అలాగే, ప్రియాంక గాంధీ కుమారుడు, కుమార్తె కూడా స్టేడియానికి వచ్చారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







