లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- December 13, 2025
హైదరాబాద్: హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జట్ల మధ్య ఇవాళ ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది.
మెస్సీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా నిర్వహించిన ఈ మ్యాచ్లో మెస్సీ టీమ్పై సింగరేణి ఆర్ఆర్ టీమ్ 3-0 గోల్స్తో గెలిచింది. ఆర్ఆర్ టీమ్ తరఫున సీఎం రేవంత్రెడ్డి ఆడి ఓ గోల్ కొట్టారు. ఇందులో మెస్సీ, రేవంత్ రెడ్డి ఆడింది 5 నిమిషాలపాటే.
అనంతరం, ఇరు జట్లకు మెస్సీ పతకాలు అందజేశారు. ఇక్కడకు వచ్చి తెలుగు వారిని కలవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక్కడి వారు చూపించిన అభిమానం ఎంతో శక్తినిచ్చిందని చెప్పారు.
కాగా, మ్యాచ్కి ముందు ఇరు టీమ్లతో మెస్సీ, రేవంత్ రెడ్డి ఫొటోలు దిగారు. ఈ మ్యాచ్ను రాహుల్ గాంధీ కూడా చూశారు. అలాగే, ప్రియాంక గాంధీ కుమారుడు, కుమార్తె కూడా స్టేడియానికి వచ్చారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









